తాపీ ధర్మారావు…

తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, పత్రికా సంపాదకుడు/ నిర్వాహకుడు , వాడుక భాషోద్యమకర్త శ్రీ గిడుగువారి శిష్యుడు ,హేతువాది మరియు నాస్తికుడు , తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం”గా జరుపుకుంటున్నాము. వారికి నివాళులు అర్పిస్తు ,వారి గురించి చిన్న విరివి .

1887 సంవత్సరంలో సెప్టెంబర్ 19న బెర్హంపూరు (బరంపురం ) జన్మించారు. ధర్మారావు స్వస్థలము శ్రీకాకుళము.వారు ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్న బరంపురము లోని ఒక తెలుగు కుటుంబములో సెప్టంబర్ ౧౯(19),౧౮౮౭(1887) తాపీ అప్పన్న నాయుడు,నరసమ్మ దంపతులకు జన్మించారు.తండ్రి వైద్యము చేసేవారు.ప్రాథమిక విద్య ౧౯౦౦(1900)వరకు శ్రీకాకుళములోను,తరువాత విజయనగరం రిప్పన్ ఉన్నతపాఠశాలలోను జరిగింది.తరువాత పర్లాకిమిడిలో ఎఫ్ఫేను,బిఎను పచయప్ప కళాశాలలోను పూర్తిచేసారు. . కల్లికోట రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేశారు. పర్లాకిమిడిలో చదివే రోజులలో వ్యవహారిక భాషావేత్త అయిన గిడుగు రామ్మూర్తి ఈయనకు గురువు కావటం విశేషం..

 వీరి ఇంటి పేరు మొదట్లో “బండి” లేదా “బండారు” కావచ్చును. అప్పన్న తాత లక్ష్మయ్య కొంతకాలం మిలిటరీలో పనిచేశారు. తరువాత తాపీ పనిలో మంచి పేరు తెచ్చుకొన్నారు. అలా వారికి శ్రీకాకుళంలో “తాపీ లక్ష్మయ్యగారు” అన్న పేరు స్థిరపడిపోయిందట. 

1910 ప్రాంతంలో కొందరు మిత్రులతో కలిసి బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించారు. ఇతని తొలి రచన 1911లో ‘ఆంధ్రులకొక మనవి’ అనే పేరుతో విలువడింది. పత్రికా నిర్వహణలో ఇతని నేర్పు అనన్య సామాన్యమైనది. ధర్మారావు గారు తెలుగు పత్రికారంగము క్రొత్తపుంతలు త్రొక్కుటకు ఆద్యులు.పత్రికారంగములో వాడుకభాషను ప్రవేశపెట్టారు. తెలుగుపత్రికలు కొండెనాగు,జనవాణి, సమదర్శిని లకు సంపాదకులుగ పనిచేసారు..౧౯౪౦(1940)కాగడా యను ప్రసిద్ద వారపత్రికను స్థాపించారు. అవి వారి ప్రతిభకు అద్దంపట్టాయి. అందుకే వారి పుట్టినరోజును  “తెలుగు మాధ్యమాల దినోత్సవం”గా జరుపుకుంటు గౌరవిస్తున్నాము

వారికి లభించిన‌ గౌరవాలు సత్కారాలు.:

ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా వున్న రోజుల్లో బొబ్బిలి రాజా వారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు, ధర్మారావుగారు ఆయన దగ్గర కార్యదర్శిగా పనిచేశారు

ఆంధ్ర రాష్ట్ర పత్రికా రచయితల మహాసభ జరిగినప్పుడు తాపీవారే మొదటి అధ్యక్షులు

ఆంధ్ర సాహిత్య అకాడమీ వారినకి విశిష్టసభ్యత్వము ఇచ్చి గౌరవించింది.

శ్రీ వేంకటేశ్వరవిశ్వవిద్యాలయము సెనేట్ సభ్యునిగ నియమింపబడ్డారుతెలుగుభాషకు వారు చేసిన అసాధరణ సేవకు గుర్తింపుగ శృంగేరి పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖర భారతీ శంకరాచార్యుల వారి నుండి 1926లో ‘ఆంధ్రవిశారద’ బిరుదుపొందారు,.

చేమకూరి వెంకటకవి రచించిన ‘విజయవిలాసం’ కావ్యానికి చేసిన ‘హృదయోల్లాస వ్యాఖ్య’కు 1971లో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారముపొందారు.

.వారి రచనలు కొన్ని

దేవాలయాలమీద బూతుబొమ్మలు

పెళ్ళి, దాని పుట్టుపూర్వోత్తరాలు

ఇనుపకచ్చడాలు

పాతపాళీ కొత్తపాళీ

ఆల్ ఇండియా అడుక్కునేవాళ్ళ మహాసభ‌

సాహిత్యమొర్మరాలు

౧౮౮౭(1887)-౧౯౦౮(1908)వారి సీయచరిత్ర “రాళ్ళు- రప్పలు ”

౧౯౫౨(1952) లో చేసిన టాల్స్టాయ్ “అన్నాకరెనా” తెలుగు అనువాదము 

చలనచిత్రసీమకు సంబంధించి కొన్ని

మోహినీ రుక్మాంగద(౧౯౩౭/1937) మాటలు

మాలపిల్ల(౧౯౩౮/1938) మాటలు 

(కథ అందించిన గుడిపాటి వెంకటచలతాపీని గౌరవంగా ‘తాతాజీ’ అని పిలిచేవారు)

రైతుబిడ్డ(౧౯౩౯/1939)మాటలు

ఇల్లాలు(౧౯౪౦/1940)

కృష్ణప్ఱేమ(౧౯౪౩/1943)మాటలు

ద్రోహి(౧౯౪౮/1948)

కీలుగుర్రం(౧౯౪౯/1949)

పల్లెటూరిపిల్ల(౧౯౫౦/1950) మాటలు

పరంధామయ్య శిష్యులుకథ(౧౯౫౦/1950) మాటలు

మంగళ(౧౯౫౧/1951)మాటలు

కన్నతల్లి(౧౯౫౩/1953)

రోజులు మారాయి(౧౯౫౫/1955)మాటలు

వీరు 1973 మే 8న మరణించారు. తాపీవారు వాడుక తెలుగుభాషకు చేసిన సేవ చిరస్మరణీయము…